- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,బాసర : నిర్మల్ జిల్లా బాసరలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి చేదు అనుభవం. దసరా నవరాత్రుల్లో భాగంగా మంగళవారం మూల నక్షత్రం సందర్భంగా బాసర సరస్వతి ఆలయానికి కడియం కుటుంబ సమేతంగా విచ్చేశారు. ఈ క్రమంలో శ్రీహరిని ఆలయ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అయితే, ఆలయానికి ఎవరైనా నాయకులు, ఉన్నతాధికారులు వస్తే ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారు. కానీ, తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం, మాజీ మంత్రి అయిన కడియం శ్రీహరికి ఎలాంటి మర్యాదలు చేయలేదు. మూల నక్షత్రం సందర్భంగా ఆయన మనుమరాలు ఆర్వికి అక్షరాభ్యాసం కోసం కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయన అక్షరాభ్యాస మండపంలో సాధారణ భక్తుడిలా 30 నిమిషాలు నిలబడి ఉన్నారు. అలా నిలబడి ఉన్న ఆయనను చూసిన భక్తులు పదవిలో ఉన్నపుడే ఎవరైనా పట్టించుకుంటారని పదవిలో లేకుంటే ఎవరు పట్టించుకోరని మాట్లాడుకున్నారు.
Next Story