అయోధ్యకు బాసర మట్టి, గోదావరి నీళ్లు

by  |
అయోధ్యకు బాసర మట్టి, గోదావరి నీళ్లు
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: అయోధ్యలో రామమందిర నిర్మాణం భూమి పూజ కోసం ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర క్షేత్ర మట్టిని, గోదావరి నదీ జలాలను సోమవారం సాయంత్రం తీసుకు వెళ్లారు. ఆగస్టు 5వ తేదీన జరుగనున్న రామ మందిర భూమిపూజ కోసం పవిత్ర అమ్మవారి పుణ్యక్షేత్రం బాసర మట్టితో పాటు, గోదావరి జలాలు తీసుకు వెళ్తున్నట్లు విహెచ్‌పీ అధికార ప్రతినిధి ఆకుల లక్ష్మణ్, భజరంగ్ దళ్ కార్యదర్శి ప్రవీణ్ తెలిపారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఈ కార్యక్రమం చేపట్టామని వారు వివరించారు.



Next Story