నేటి నుంచి బార్లు, థియేటర్లు బంద్..

by  |
నేటి నుంచి బార్లు, థియేటర్లు బంద్..
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహా సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పుణేలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న కారణంగా నేటి నుంచి రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

అదే సమయంలో నేటి నుంచి వారం రోజుల పాటు పుణే బార్లు, హోటళ్లు, థియేటర్లను మూసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. అంత్యక్రియలు, వివాహాలు మినహా అన్ని ఫంక్షన్లకు అనుమతి నిరాకరిస్తున్నట్టు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Next Story

Most Viewed