- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : గణతంత్ర వేడుకల్లో తలెత్తిన విధ్వంసం తర్వాత వెనక్కితగ్గిన రైతు సంఘాల నాయకులు, రైతులు మళ్లీ కదం తొక్కారు. సాగు చట్టాలను రద్దు చేసేంత వరకు తమ నిరసనను వదిలేది లేదని ఢిల్లీ సరిహద్దుల వెంబడి సోమవారం భారీ ఎత్తున ఆందోళనను నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి-6వ తేదీ (శనివారం) దేశవ్యాప్తంగా రోడ్లను నిర్భంధిస్తామని భారతీయ కిసాన్ యూనియన్(BKU) అధ్యక్షులు బల్బీర్ సింగ్ రాజేవాల్ స్పష్టం చేశారు.
మధ్యాహ్నం 12 గంటల నుంచి 3వరకు తమ ఆందోళన కొనసాగుతుందని వెల్లడించారు. ఇదిలాఉండగా, రైతులతో తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, తాము సాగు చట్టాలను రద్దు చేసేంతవరకు వెనక్కి తగ్గబోమని రైతుసంఘాల నాయకులు తెగేసి చెబుతున్నారు. దేశరాజధాని సరిహద్దుల్లో ఇప్పటికీ వీరు చేపట్టిన ఆందోళన రెండు నెలలుగా సాగుతోంది.