- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ముంబయి: 2019-20 ఆర్థిక సంవత్సరంలో మార్చిలో ముగిసిన చివరి త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నికర లాభం 28.37 శాతం క్షీణించి రూ. 53.78 కోట్లకు చేరిందని వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 75.08 కోట్లుగా నమోదైంది. అలాగే, మొత్తం నిర్వహణ ఆదాయం 1.12 శాతం పెరిగి రూ. 2,806.33 కోట్లకు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికానికి రూ. 2,775.22 కోట్లుగా ఉంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి పరిశీలిస్తే..నికర లాభం రూ. 398.84 కోట్లుగా నమోదైంది. అంతకుముందు 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 4,763.25 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. మొత్తం నిర్వహణ ఆదాయం 5.95 శాతం పెరిగి రూ. 11,495.53 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ ఆదాయం రూ. 10,849.68 కోట్లుగా ఉంది.
Next Story