నిన్ను వదలా.. బండ్ల గణేష్‌కు మళ్లీ కరోనా?

by  |
Bandla Ganesh
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌ను కరోనా కుదిపేస్తుంది. ఇటీవల ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రెండోసారి కరోనా బారిన పడగా.. గత కొద్దిరోజుల క్రితం దిల్ రాజుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇక టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్‌కు కూడా కరోనా సోకగా.. తాజాగా టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మళ్లీ కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది.

గతంలో ఒకసారి బండ్ల గణేష్‌కు కరోనా సోకగా.. జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యాడు. ఇప్పుడు మరోసారి కరోనా బారిన పడగా.. ప్రస్తుతం అపోలో హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతున్నాడని, వైద్యులు ఐసీయూలో ఉంచి బండ్లకు చికిత్స అందిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వార్తలపై అధికారికంగా బండ్ల గణేష్ నుంచి లేదా అతడి ఫ్యామిలీ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

కానీ బండ్ల గణేష్‌కు మళ్లీ కరోనా వచ్చినట్లు మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల వకీల్ సాబ్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్‌కు బండ్ల హాజరయ్యాడు. మరుసటి రోజే జ్వరం రావడంతో టెస్టు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది.


Next Story