దీక్ష విరమించిన బండి సంజయ్

by  |
దీక్ష విరమించిన బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష విరమించారు. సిద్దిపేట సీపీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ దీక్షకు దిగిన బండి సంజయ్‌కు బీజేపీ నేతలు వివేక్, జితేందర్‌రెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప జేశారు. సంజయ్ ఆరోగ్యం క్షీణించడంతో బీజేపీ శ్రేణులు ఆయన్ను మంగళవారం రాత్రి ఆస్పత్రికి తరలించాయి. షుగర్ లెవల్స్ 55కు పడిపోగా ప్రభుత్వ వైద్యులు ప్లూయిడ్స్ ఎక్కించారు. అనంతరం షుగర్ లెవల్స్ సాధారణ స్థాయికి రావడంతో తదుపరి చికిత్స కోసం వేరే ఆస్పత్రికి తరలించారు. సిద్దిపేటలో నిన్న సోదాల్లో రఘునందన్‌రావు బంధువు ఇంట్లో రూ.18లక్షలు పట్టుబడటంతో పోలీసులకు బీజేపీ శ్రేణులకు వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీపీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్ దీక్షకు దిగారు.



Next Story