BJP : బీజేపీ ఆఫీస్‌లో బండి సంజయ్ దీక్ష.. డిమాండ్‌లు ఇవే!

by  |
BJP : బీజేపీ ఆఫీస్‌లో బండి సంజయ్ దీక్ష.. డిమాండ్‌లు ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ‘‘తెలంగాణ రైతు గోస బీజేపీ పోరు దీక్ష’ను చేపట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ… యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తాలు, తరుగు పేరుతో రైతులను వేధించడం ఆపాలని సూచించారు. తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలని వెల్లడించారు. రైతుబంధు నిధులు విడుదల చేసి, రైతు రుణమాఫీ చేయాలని కోరారు.

Next Story