టార్గెట్ హుజురాబాద్ @ జాతీయ నేతలతో బండి కీలక సమావేశం

by  |
bandi-sanjay bjp cheif
X

దిశ, వెబ్‌డెస్క్ : కాసేపట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అధ్యక్షతన రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ కీలక సమావేశం ప్రారంభంకానుంది. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్, జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ హాజరుకానున్నారు. శుక్రవారం జరిగే బీజేపీ మీటింగ్‌లో కీలక విషయాలపై చర్చించనున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో పార్టీ బలోపేతం, మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరిక, హుజురాబాద్ బై ఎలక్షన్‌ను ఎలా ఎదుర్కొవాలనే అంశంపై రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, జాతీయ నేతతో బండి సంజయ్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. అధికార టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యుహాలను అమలు చేయాలనే దానిపై జాతీయ నేతలు రాష్ట్ర నాయకత్వానికి పలు సూచనలు చేయనున్నట్లు సమాచారం.

Next Story