బీజేపీ-టీఆర్ఎస్ ఒక్కటి కాదు.. క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్

by  |
బీజేపీ-టీఆర్ఎస్ ఒక్కటి కాదు.. క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్
X

దిశ‌, ఆందోల్: ఎంద‌రో అమరులు ప్రాణ త్యాగం చేస్తే ఏర్పడ్డ తెలంగాణ, 4 కోట్ల మంది ఆకాంక్ష ఓ మూర్ఖుడి చేతిలో బందీ అయ్యిందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర శ‌నివారం జోగిపేట‌కు చేరుకున్న సంద‌ర్భంగా ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ త‌ల్లి ఆత్మ ఘోషిస్తుందని.. అటువంటి కేసీఆర్ గ‌డీలు బద్దలు కొట్టండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా బీజేపీ-టీఆర్ఎస్ ఒక్కటేనన్న కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీ-టీఆర్‌ఎస్ పార్టీలు ఎప్పటికీ ఒక్కటి కాదని.. కారు పార్టీ నాయ‌కులను కాపాడుకునేందుకే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారని బండి సంజయ్ సెటైర్లు వేశారు. రెండు పార్టీలు ఒక్కటైతే దుబ్బాక‌, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఎలా విజయం సాధించిందో చెప్పాలన్నారు. వచ్చే హుజురాబాద్ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం ఖాయమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed