కమీషన్ల కోసమే ప్రాజెక్టుల నిర్మాణం

by  |
కమీషన్ల కోసమే ప్రాజెక్టుల నిర్మాణం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఇవాళ రెండు గంటలపాటు జరిగిన అపెక్స్‌ కౌన్సిల్ సమావేశంలో సీఎం కేసీఆర్ తెలంగాణ హక్కుల గురించి మాట్లాడలేదని విమర్శించారు. ఇద్దరు సీఎంలు కేసీఆర్, జగన్ కలిసి తెలుగు రాష్ట్రాల ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ గురించి సమావేశంలో కేసీఆర్ కనీసం మాట ఎత్తకపోవడం దారుణమన్నారు. కాంట్రాక్టర్ల కమీషన్ల కోసమే ప్రాజెక్టులు చేపడుతున్నారని, రైతులను ఆదుకోవాలన్న సోయి ప్రభుత్వానికి లేదని ధ్వజమెత్తారు.



Next Story

Most Viewed