అన్నంత పని చేసిన బండి సంజయ్.. చెవులు కొరుక్కుంటున్న జనం

by  |
bandi-sanjay1
X

దిశ, హుజురాబాద్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై హుజురాబాద్ ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. మంగళవారం హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు విడుదలైన విషయం విధితమే. అయితే, ఈ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల బండి సంజయ్ పలు వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ప్రజలు రెండురోజుల ముందే దీపావళి పండుగ జరుపుకుంటారని, కేసీఆర్ కు, టీఆర్ఎస్ కు త్రిబుల్ ఆర్ సినిమా చూపిస్తానని, రఘునందన్ రావు, రాజా సింగ్, రాజేందర్ లు అసెంబ్లీలో ప్రజా గొంతుకై సమస్యలపై పోరాడుతారని ఆయన చెప్పారు. ఇప్పుడా వ్యాఖ్యలపై హుజురాబాద్ ప్రజలు చర్చించుకుంటున్నారు. బండి సంజయ్ అన్నంత పని చేశారంటూ చెవులు కొరుక్కుంటున్నారు.


Next Story

Most Viewed