పోడు భూములపై విధివిధానాలను ప్రకటించాలి: బండి

by Shyam |

<p>దిశ,వెబ్‌డెస్క్: గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహరాజ్ అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సేవాలాల్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ&#8230;‘సేవలాల్ తెలుగు గడ్డపై జన్మించడం గర్వకారణం. సంచార జాతులను సేవాలాల్ ఏకతాటిపైకి తెచ్చారు. ప్రభుత్వం గిరిజన భూములను లాక్కుంటోంది. 10శాతం గిరిజనుల రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. గిరిజనుల రిజర్వేషన్ల పట్ల సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ది లేదు. సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రజలు బుద్ది చెబుతారు. [&hellip;]</p>

పోడు భూములపై విధివిధానాలను ప్రకటించాలి: బండి
X

దిశ,వెబ్‌డెస్క్: గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహరాజ్ అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సేవాలాల్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ…‘సేవలాల్ తెలుగు గడ్డపై జన్మించడం గర్వకారణం. సంచార జాతులను సేవాలాల్ ఏకతాటిపైకి తెచ్చారు. ప్రభుత్వం గిరిజన భూములను లాక్కుంటోంది. 10శాతం గిరిజనుల రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. గిరిజనుల రిజర్వేషన్ల పట్ల సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ది లేదు. సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రజలు బుద్ది చెబుతారు. పోడు భూములపై విధివిధానాలను సీఎం కేసీఆర్ ప్రకటించాలి. తండాలను పంచాయతీలుగా చేసి నిధులు ఇవ్వడం లేదు’ అని అన్నారు.

Next Story