- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, న్యూస్బ్యూరో: కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ప్యాకేజీ వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కొనియడారు. కరోనా విపత్కర సమయంలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన పథకాల్లో రూ.లక్ష కోట్లు వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి కేటాయించడం జరిగిందన్నారు. మార్కెట్ యార్డుల నిర్మాణం పై దృష్టి సారించడం మైక్రో వుడ్ ఎంటర్ ప్రైజెస్ కోసం రూ.10వేల కోట్లతో కొత్త పథకం తీసుకువచ్చారని తెలిపారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ద్వారా మత్స్య రంగానికి రూ. 20వేల కోట్లు కేటాయించి చేపల ఉత్పత్తి, ఎగుమతులు పెంచేలా చర్యలు తీసుకుందన్నారు. నిత్యావసరాల చట్ట సవరణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షదాయకమన్నారు. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించడానికి తీసుకున్న నిర్ణయాలతో దేశం స్వావలంబన దిశగా అడుగులు వేయడం ఖాయమన్నారు.