సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలి: బండి సంజయ్

by  |
సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలి: బండి సంజయ్
X

దిశ, కోదాడ: టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు అభద్రతాభావం ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బుధవారం కోదాడ పర్యటనలో భాగంగా సంజయ్ మీడియాతో మాట్లాడారు. గుర్రంపోడు తండాలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక ఆక్రమణలకు పాల్పడ్డారని. హింసాత్మక చర్యలకు దిగారని ఆరోపించారు. వారిని అడ్డుకోబోయిన బీజేపీ నేతలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా ఉండాల్సింది పోయి.. కబ్జాదారులకు కొమ్ముకాయడం దారుణమన్నారు. గిరిజనులకు పట్టాలు ఇస్తామని చెబుతున్న సీఎం కేసీఆర్.. ఎవరికి.. ఎక్కడా ఇచ్చారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed