‘కేసీఆర్ బిన్ లాడెన్ వారసుడు’

by  |
‘కేసీఆర్ బిన్ లాడెన్ వారసుడు’
X

దిశ, వెబ్‌డెస్క్: తాము ఛత్రపతి శివాజీ వారసులమైతే.. కేసీఆర్ బిన్ లాడెన్, బాబర్, అక్బర్ వారసుడు అంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పోరాటంలో వ్యతిరేక నినాదాలు చేసిన ఎంఐఎం పార్టీతో దోస్తీ చేస్తున్న సీఎం కేసీఆర్‌ను గద్దె దించుతామన్నారు. హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి టీఆర్‌ఎస్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, అనుచరులు బండి సంజయ్, డీకే అరుణ, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, జితేందర్ రెడ్డిల సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 75 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

భారతీయ జనతా పార్టీ బరాబర్ హిందూవుల పార్టీ అని గుర్తు చేసిన బండి సంజయ్.. హిందూ ధర్మానికి ఎవరైనా అడ్డొస్తే తొక్కెస్తామన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ముచ్చెమటలు పట్టేలా చేస్తామని హెచ్చరికలు చేశారు. జీహెచ్ఎంసీ వాసులు వరదల్లో ఉంటే కనీసం పరామర్శకు కూడా రాకుండా సీఎం నిర్లక్ష్యం వహించారన్నారు. అందుకే కేసీఆర్‌ను ఫామ్ హౌజ్‌కే పరిమితం చేయాలని ప్రజలు కూడా నిర్ణయం తీసుకున్నారని బండి సంజయ్ చెప్పారు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని వంద సీట్లు లక్ష్యంగా దూసుకెళ్తూ.. 75 స్థానాల్లో విజయం సాధిస్తామని బండి సంజయ్ ఈ సందర్భంగా తెలియజేశారు.



Next Story

Most Viewed