‘సీఎం ఫాంహౌజ్‌లో ఉంటే.. మరి ప్రజలు’

by  |
‘సీఎం ఫాంహౌజ్‌లో ఉంటే.. మరి ప్రజలు’
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ ఫాంహౌజ్‌లో నిద్రపోతే.. పేద ప్రజలు వరద నీళ్లల్లో ఉండాలా అంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలకు ముంపునకు గురైనా ఏరియాల్లో బండి సంజయ్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా అధికార పార్టీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేద ప్రజలు కష్టాలను తెలుసుకోకుండా.. వారి సమస్యలను పరిష్కరించకుండా ఫాంహౌజ్‌లో ఏం చేస్తున్నారని బండి మండిపడ్డారు. ప్రజలు ముఖ్యమంత్రిని చేసింది గడీలో విశ్రాంతి తీసుకోడానికి కాదని ఆయన చురకలు వేశారు. కోట్ల నిధులు విడుదల చేశామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్.. ఆ నిధులను ఏం చేశారో సమాధానం చెప్పాలంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు.


Next Story