- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆదిలాబాద్: జీవో నెంబర్ 3ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవాల్ చేయాలని కోరుతూ ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చిన బంద్ విజయవంతమైంది. తుడుందెబ్బ ఆధ్వర్యంలో పదికి పైగా వివిధ ఆదివాసీ సంఘాలు ఐక్యంగా బంద్లో పాల్గొన్నాయి. గిరిజనేతర సంఘాలు కూడా బంద్కు సహకరించాయి. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు, జైనూరు, నార్నూర్, ఇంద్రవెల్లి.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి, తిర్యాని, ఆసిఫాబాద్, వాంకిడి తదితర మండల కేంద్రాల్లో వ్యాపార, వాణిజ్య కేంద్రాలు మూతపడ్డాయి. ఉదయం నుంచి ఆదివాసీ సంఘాల నేతలు బంద్కు సహకరించాలని కోరుతూ దుకాణాలు మూసి వేయించారు. బంద్ జయప్రదం చేయడం కోసం తుడుందెబ్బ నేతలతో పాటు పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సహకరించారు.
Next Story