- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టకొని మాట్లాడాలని, లేకుంటే అంతే ధీటుగా జవాబు ఇస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ను విమర్శించే స్థాయి బండి సంజయ్కు లేదన్న బాల్క సుమన్.. స్మార్ట్ సిటీ నిధులను ఢిల్లీలో ఆపేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలకు దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాలని సవాల్ విసిరారు. ఎంపీగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలని, ఆయనకు ఎంపీ పదవి కూడా సీఎం కేసీఆర్ పెట్టిన భిక్షేనన్నారు. కేసీఆర్ ఉద్యమం చేయకుంటే… తెలంగాణ రాకుంటే సంజయ్కి ఆ పదవి ఎక్కడిదని బాల్క సుమన్ ప్రశ్నించారు. మంగళవారం కరీంనగర్లో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.
Next Story