బండి సంజయ్‌కు ఎంపీ పదవి కేసీఆర్ పెట్టిన భిక్షే: బాల్క సుమన్

by  |
MLA Balka Suman
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. బండి సంజయ్‌ నోరు అదుపులో పెట్టకొని మాట్లాడాలని, లేకుంటే అంతే ధీటుగా జవాబు ఇస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ను విమర్శించే స్థాయి బండి సంజయ్‌కు లేదన్న బాల్క సుమన్.. స్మార్ట్ సిటీ నిధులను ఢిల్లీలో ఆపేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలకు దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాలని సవాల్ విసిరారు. ఎంపీగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలని, ఆయనకు ఎంపీ పదవి కూడా సీఎం కేసీఆర్ పెట్టిన భిక్షేనన్నారు. కేసీఆర్ ఉద్యమం చేయకుంటే… తెలంగాణ రాకుంటే సంజయ్‌కి ఆ పదవి ఎక్కడిదని బాల్క సుమన్ ప్రశ్నించారు. మంగళవారం కరీంనగర్‌లో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed