ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారా?

by  |
ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: అప్పుల్లో, నష్టాల్లో ఉన్న సంస్థను ప్రైవేటీకరించడమే ప్రభుత్వ సిద్ధాంతమైతే.. అప్పుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుగా అమ్ముకోవాలని, తర్వాత ఆర్టీసీ గురించి ఆలోచించాలని టీఎస్​ఆర్టీసీ ఎంప్లాయీస్​ యూనియన్ ​అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాబు, రాజిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. ఆర్టీసీ ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం స్పాట్​ పెట్టిందని, అందుకే ఏడేళ్లుగా ఎండీ, చైర్మన్​ లేని సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్​ గా ఐపీఎస్ అధికారి సజ్జనార్​ను, చైర్మన్​గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్​ని నియమించారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రైవేటీకరణ ప్రస్తావనే రాలేదని, ఆంధ్ర పాలకులను విమర్శించే కేసీఆర్​ మాత్రం 4 నెలల్లో ప్రైవేటీకరణ అని చైర్మన్​కు బ్లూప్రింట్​ ఇచ్చి ఎలా పంపుతారని నిలదీశారు.

ఆర్టీసీ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థ అని, ఐదేళ్లు పరిపాలన కోసం వచ్చిన కాంట్రాక్ట్​ బేసిస్​మంత్రివర్గానికి ప్రైవేటీకరించే హక్కు లేదన్నారు. దీనిలో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉందని, ఈ విషయాన్ని అసలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారా? లేదా? అని మండిపడ్డారు. 8 గంటలు పనిచేయాల్సిన ఉద్యోగులు, కార్మికులు 16 గంటలు పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed