29 శాతం క్షీణించిన బజాజ్ ఫైనాన్స్ నికర లాభాలు

by  |
29 శాతం క్షీణించిన బజాజ్ ఫైనాన్స్ నికర లాభాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎన్‌బీఎఫ్‌సీ దిగ్గజం బజాజ్ ఫైనాంచ్ నికర లాభం 29 శాతం క్షీణించి రూ. 1,146 కోట్లుగా నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ రూ. 1,614 కోట్లను నమోదు చేసింది. మూడో త్రైమాసికంలో కంపెనీ రుణాలు, కేటాయింపు రూ. 1,352 కోట్లకు పెరిగాయని, అంతకుముందు ఏడాదిలో ఇవి రూ. 831 కోట్లని కంపెనీ పేర్కొంది.

సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయ 5 శాతం తగ్గి రూ. 4,296 కోట్లకు చేరింది. అదేవిధంగా కంపెనీ స్థూల నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) 0.55 శాతానికి తగ్గాయి. అంతకుముందు ఏడాదిలో ఎన్‌పీఏలు 1.61 శాతంగా నమోదయ్యాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.


Next Story

Most Viewed