AP News :ధూళిపాళ్లకు బెయిల్ మంజూరు

by  |
AP News :ధూళిపాళ్లకు బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్‌డెస్క్ : సంగం డెయిరీ కేసులో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు నరేంద్రతో పాటు గోపాల్‌కృష్ణన్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు వారికి బెయిల్‌ ఇచ్చింది. అయితే.. వారు నాలుగు వారాల పాటు విజయవాడ మున్సిపల్ పరిధిలోనే ఉండాలని హైకోర్టు ష‌ర‌తు విధించింది. అలాగే, విచారణకు 24 గంటల ముందు విచారణ అధికారి వారికి నోటీసు ఇవ్వాలని సూచించింది. సంగం డెయిరీ కేసులో ధూళిపాళ, ఎండీ గోపాలకృష్ణ, సహకారశాఖ మాజీ అధికారి గురునాథాన్ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.


Next Story