- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం ఉపఎన్నికకు సిఈవో కే విజయానంద్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇటీవలే కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. శుక్రవారం నుంచే నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు సిఈవో కే విజయానంద్ వెల్లడించారు. నామినేషన్ దాఖలుకు అక్టోబర్ 8 చివరి తేదీ అని తెలిపారు. అక్టోబర్ 11న నామినేషన్లను పరిశీలిస్తారు.
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13. అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్.. నవంబర్ 2న ఓట్ల ఫలితాలను వెల్లడించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా సబ్కలెక్టర్ కేతన్ గార్గ్ను నియమిస్తున్నట్లు వెల్లడించారు. నోటిఫికేషన్ విడుదల కావడంతో జిల్లా వాప్యంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనల అమలు నేపథ్యంలో బహిరంగ సభకు 1,000 మందికి మించి అనుమతించబోమని స్పష్టం చేశారు.