మహేష్ బాబు అభిమానులకు బ్యాడ్ న్యూస్..

by  |
మహేష్ బాబు అభిమానులకు బ్యాడ్ న్యూస్..
X

దిశ, సినిమా : సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘సర్కారు వారి పాట’ మూవీ యూనిట్ లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చింది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా న్యూ రిలీజ్ డేట్ ప్రకటించింది. ముందుగా ఈ చిత్రాన్ని సంక్రాంతికే రిలీజ్ చేసేందుకు మొగ్గుచూపిన మేకర్స్.. కొవిడ్ కారణంగా షూటింగ్ లేట్ కావడంతో విడుదల తేదీని మార్చేశారు. ఈ క్రమంలోనే సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నట్లు.. ఏప్రిల్ 1న సోలోగా వచ్చేస్తున్నట్లు అఫిషియల్‌గా అనౌన్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ సినిమాస్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు తెలుపుతూ.. దివాళీ శుభాకాంక్షలు చెప్పారు.



Next Story

Most Viewed