సిబ్బంది నిర్లక్ష్యం.. శిశువు తారుమారు

by  |
సిబ్బంది నిర్లక్ష్యం.. శిశువు తారుమారు
X

దిశ, వెబ్‌డెస్క్ : అప్పుడే పుట్టిన శిశువును తల్లిదండ్రులకు అప్పగించడంలో ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఒకరి శిశువును మరొక దంపతులకు అందజేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. రజిత అనే మహిళకు జన్మించిన ఆడ శిశువును ఆస్పత్రికి సిబ్బంది రచన కుటుంబసభ్యులకు అందజేశారు. ఇదేంటనీ బాధిత కుటుంబ సభ్యులు ప్రశ్నించగా, తీరా తప్పు తెలుసుకుని మరల శిశువును రజిత కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ విషయం బయటకు లీక్ అవడంతో వైరల్‌గా మారింది.



Next Story

Most Viewed