అమానుషం.. బాత్‌రూమ్‌లో పుట్టిన బిడ్డ మృతి

by  |
అమానుషం.. బాత్‌రూమ్‌లో పుట్టిన బిడ్డ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : వికారాబాద్ జిల్లా తాండూరులో అమానుష ఘటన వెలుగుచూసింది. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన గర్భిణిని అడ్మిట్ చేయకుండా సిబ్బంది నిర్లక్ష్యం వహించారు. దీంతో ఆస్పత్రి బాత్‌రూమ్‌లో మహిళ ప్రసవించడంతో శిశువు పుట్టగానే చనిపోయింది. దీంతో బాధిత కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నవమాసాలు మోసిన బిడ్డ విగతాజీవిగా మారడంతో తల్లి ఆవేదన వర్ణణాతీతం. ఇక శిశువు మృతికి వైద్యులే కారణమంటూ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.


Next Story