డీజీపీ గారూ.. భద్రత కల్పించండి: చంద్రబాబు

by  |
Chandrababu
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యకు వన్ ప్లస్ వన్ భద్రతను పునరుద్ధరించాలని ఆ లేఖలో చంద్రబాబు కోరారు. ఇంకా ఈ లేఖలో ఏమన్నారంటే.. వర్ల రామయ్య ప్రజా సేవకు కట్టుబడి ఉన్నసీనియర్ నాయకుడు అని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీసే ముఖ్యమైన ప్రతినిధి పేర్కొన్నారు. ఎస్టీఎఫ్, ఉగ్రవాద వ్యతిరేక శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించారని బాబు గుర్తు చేశారు. దాదాపు దశాబ్దం పాటు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు వన్ ప్లస్ వన్ భద్రతను కొనసాగించిందని తెలిపారు. హింస, బెదిరింపులతో భయపెడుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, వర్ల రామయ్య భద్రతపై ఆందోళన చెందుతున్నామని చెప్పారు. అవినీతి, అసాంఘిక వ్యతిరేక కార్యకలాపాలపై మాట్లాడుతున్న రామయ్యను వ్యతిరేకులు తమ ప్రధాన శత్రువుగా భావించే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో రామయ్యకు సరైన భద్రతా రక్షణ కల్పించాలని లేఖలో బాబు డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed