- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదాపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. విధ్వంసం సృష్టించి ఎన్నిక వాయిదా వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అభిప్రాయపడ్డారు. ఎన్నిక నిర్వహించడం చేతగాకపోతే ఎస్ఈసీ, డీజీపీ పదవులనుంచి తప్పుకోవాలి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికను అడ్డుకునే బదులు అధికారపార్టీ వారిని చైర్మన్గా నియమించుకోండి.
భయభ్రాంతులకు గురిచేసి టీడీపీ సభ్యులను లోబర్చుకోవాలని చూస్తున్నారు. మారణాయుధాలతో సంబంధం లేని వ్యక్తులు వచ్చి హల్ చల్ చేస్తున్నా పోలీసులు గుడ్లప్పగించి చూస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నానితో సహా టీడీపీ సభ్యులు క్రమశిక్షణ, ఓర్పుతో వ్యవహరిస్తున్నారు. మా సహనాన్ని చేతగానితనంగా పరిగణించొద్దు. కొండపల్లి చైర్మన్ ఎన్నిక నిర్వహించి ప్రజాస్వామ్య విలువలను కాపాడండి అంటూ అధికారులకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.