జగన్ వల్లే ప్రమాదాలు: చంద్రబాబు

by  |
Chandrababu
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్లే పరిశ్రమల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. విశాఖపట్టణం పారిశ్రామికవాడ పరవాడలోని రాంకీ ఫార్మాసిటీలో విశాఖ సాల్వెంట్స్ పరిశ్రమలో చోటుచేసుకున్న ప్రమాదంలో మృతి చెందిన జూనియర్ ఆపరేటర్ కాండ్రేగుల శ్రీనివాసరావు కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ఇచ్చిన ప్యాకేజీనే సాల్వెంట్ ప్రమాద బాధితులకు కూడా వర్తింపజేయాలని ఆయన ఆయన కోరారు. ఎల్జీ పాలిమర్స్ తరహాలోని ప్రమాదానికి కారణమైన కంపెనీ ప్రతినిధులను కూడా అరెస్ట్ చేయాలని ఆయన సూచించారు. వారిని వదిలేసి పరామర్శకు వెళ్లిన నేతలను అరెస్ట్ చేయడం దారుణమని విమర్శించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం 35 లక్షల రూపాయలు, పరిశ్రమ 15 లక్షలు పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed