వయస్సు ఎంతైతే ఉందో అన్ని నిమిషాలు అలా.. చేయండి: డాక్టర్ స్రవంతి

by  |
Dhyanam-1
X

దిశ, మహబూబాబాద్ టౌన్: ప్రశాంతమైన జీవితం గడపడానికి మన వయస్సు ఎంతైతే ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలని డా. స్రవంతి అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని యూపీహెచ్ సీ ఆధ్వర్యంలో ఆజాది కా అమ్రిత్ మహోత్సవ్ లో భాగంగా ఆరోగ్యకరమైన అంశాలపై కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. స్రవంతి మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ 30 నిమిషాలు వాకింగ్, సూర్య నమస్కారం చేయాలన్నారు. కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్యానికి గురవుతామని.. కారం, ఉప్పు, మసాలాలు తక్కువ మోతాదులో తీసుకోవాలని సూచించారు. పౌష్టికాహారం తీసుకోవటం, చెడు అలవాట్లను మానేయటం వల్ల క్యాన్సర్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ దరిచేరకుండా కాపాడుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డా. సిద్ధార్థ, రామకృష్ణ, శారద, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.


Next Story