ఆ రెండు అంశాలపై రాష్ట్రపతికి ‘ఆజాద్’ ఫిర్యాదు..

by  |
ఆ రెండు అంశాలపై రాష్ట్రపతికి ‘ఆజాద్’ ఫిర్యాదు..
X

దిశ, వెబ్‌డెస్క్ :

రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్‌తో పాటు, కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై కాంగ్రెస్ జాతీయ నేత ఆజాద్ రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌కు ఫిర్యాదుచేశారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ డిప్యూటీ చైర్మన్ పోడియం వద్దకు వెళ్ళడమే కాకుండా, మైక్ విరగొట్టారనే నెపంతో రాజ్యసభ సభ్యులు 8 మందిని చైర్మన్ వెంకయ్య నాయుడు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

అయితే, వారిపై సస్పెన్షన్ ఎత్తివేయడమే కాకుండా, వ్యవసాయ బిల్లులను కేంద్రం ఉపసంహరించుకునేలా చర్యలకు ఉపక్రమించాలని రాష్ట్రపతి కోవింద్‌కు ఆజాద్ విన్నవించారు.



Next Story

Most Viewed