- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా జీవితం ధన్యమైంది: యూపీ సీఎం యోగి
by Malleboina Mahesh |
అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట అనంతరం.. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రముఖులతో సమావేశం నిర్వహించారు.

X
దిశ, వెబ్డెస్క్: అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట అనంతరం.. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూపీ సీఎం యోగి ఆధిత్యనాధ్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. రామ మందిరం కోసం అనేక మంది పౌరులు, సాధుసంతులు పోరాడారు. శతాబ్దాల తర్వాత అయోధ్యకు ఈ రోజు పూర్వవైభవం వచ్చింది. ముందుగా అనుకున్న చోటనే శ్రీరాముని ఆలయాన్ని నిర్మించాం. ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం తో నా జీవితం ధన్యమైంది అని యోగి ఆధిత్యనాధ్ చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ దూరదృష్టి, అంకితభావంతో ఈ గొప్ప కార్యం సాకారమైంది. ఇక నుంచి అయోధ్యలో బుల్లెట్ల వర్షం కురవదు. కర్ఫ్యూ ఉండదు. అంతా రామ రాజ్యం ఉంటుంది. సంస్కృతి, అభివృద్ధి నగరంగా అయోధ్య విలసిల్లుతుందని సీఎం యోగి అన్నారు.
Next Story






