11 రోజుల్లో అయోధ్య రామ మందిరం ప్రారంభం.. ప్రధాని మోడీ సంచలన నిర్ణయం

by Disha Web Desk 4 |
11 రోజుల్లో అయోధ్య రామ మందిరం ప్రారంభం.. ప్రధాని మోడీ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. మరో 11 రోజుల్లో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ శుక్రవారం ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ‘అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టకు మరో 11 రోజులు మాత్రమే ఉంది. మహోత్తర ఘట్టాన్ని ప్రారంభించే క్రతువులో భాగస్వామ్యం కావడం నా అదృష్టం. భగవంతుడు దేశ ప్రజల తరఫున తనను ఓ సాధనంలా ఈ వేడుకలో భాగస్వామిని చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఈ రోజు నుంచి 11 రోజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తాను. మీ అందరి ఆశీర్వాదాలు నాకు కావాలి. ఈ సందర్భంగా నా భావాలు తెలపడం కష్టంగా ఉన్నా.. నా తరఫు నుంచి చేయగలిగిందతా చేస్తాను’ అని మోడీ ట్వీట్ చేశారు.

Next Story