- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రామమందిర ప్రారంభోత్సవం.. ఆ 84 సెకన్లే కీలకం
దిశ, నేషనల్ బ్యూరో: రామమందిర ప్రారంభోత్సవానికి మరి కాసేపట్లో తెరపడనుంది. ఈ వేడుకకు హాజరవ్వడానికి ఇప్పటికే భారత్, విదేశాలకు చెందిన ప్రతినిధులు అయోధ్యకు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం 10:55నిమిషాలకు అయోధ్య రామాలయంకు చేరుకుంటారు. అయితే విగ్రహ ప్రతిష్టాపనకు శుభ సమయం కేవలం 84 సెకన్ల పాటు ఉండనుంది. మధ్యాహ్నం 12:29:03 నుంచి12:30:35 గంటల వరకు మాత్రమే శుభ సమయంగా ఉంది. ఈ 84 సెకన్లలోనే ప్రాణప్రతిష్టకు సంబంధించిన కీలక ఘట్టం ఆవిష్కృతమయ్యే అవకాశం ఉంది. పండితులు దీనిని ఎంతో శుభ ముహూర్తంగా పేర్కొంటున్నారు. ఈ సమయాన్ని కాశీ జ్యోతిష్కుడు పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు150కి పైగా సంప్రదాయాలకు చెందిన సాధువులు, మత పెద్దలు, గిరిజన సంప్రదాయాలకు చెందిన 50 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. శంకుస్థాపన అనంతరం ఆలయాన్ని నిర్మించిన కార్మికులతో ప్రధాని మోడీ సమావేశమవుతారు.