కరోనా థర్డ్ వేవ్ నుంచి తప్పించుకోవాలంటే ఇలా చేయండి: సత్తయ్య

by  |
yOGA1
X

దిశ, షాద్ నగర్: కరోనాను అరికట్టడంలో భాగంగా ప్రతి ఒక్కరూ యోగాపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పతంజలి యోగ గురువు అల్లే సత్తయ్య అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు యోగాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోవు మూడవవిడత కరోనా వైరస్ ను తట్టుకోవాలంటే ప్రతి ఒక్కరూ నిజ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని, సూర్యనమస్కారాలు, ప్రణయామం, ధాన్యం ద్వారా రోగాలను తరిమికొట్టొవచ్చని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిరోజు ఉదయం యోగా క్లాసులు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుధారాణి, లెక్చలర్ రమేష్, సంతునాయక్, నారాయణతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed