ఎల్లూరి శివారెడ్డి, జుర్రు చెన్నయ్యలకు పురస్కారాలు

by  |
Awards1
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: పద్మభూషణ్ డాక్టర్ కె. ఐ. వరప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలోని శాంతా వసంత ట్రస్ట్ పురస్కారాలు ప్రకటించింది. డాక్టర్ ఎల్లూరి శివారెడ్డికి డాక్టర్ వరప్రసాద్ రెడ్డి ఉత్తమ సాహితీవేత్త పురస్కారాన్ని, డాక్టర్ జుర్రు చెన్నయ్యకు తెలుగు భాషా సేవా రత్న పురస్కారాన్ని అందజేయనున్నట్టు ప్రకటించింది. ఈ నెల 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని తెలంగాణ సారస్వత పరిషత్ లో జరిగే సభలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ఒక్కొక్కరికి లక్ష రూపాయలతో పాటు శాలువా, జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో సత్కరించనున్నారు. ఈ కార్యక్రానికి డాక్టర్ వరప్రసాద్ రెడ్డి అధ్యక్షత వహించనుండగా రసమయి అధ్యక్షుడు డాక్టర్ ఎం.కె.రాము విశిష్ట అతిధిగా పాల్గొంటారని శాంతా వసంత ట్రస్టు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.



Next Story

Most Viewed