తెలంగాణ పీహెచ్ సీలకు అవార్డులు: కేంద్ర మంత్రి మాండవియా

by  |
తెలంగాణ పీహెచ్ సీలకు అవార్డులు: కేంద్ర మంత్రి మాండవియా
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం ‘రోగి సురక్ష సప్త’ సందర్భంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మన్సుఖ్ ఎల్. మాండవీయా శుక్రవారం అవార్డులను ప్రకటించారు. 2018-19 నుండి 2020-21 వరకు జాతీయ నాణ్యతా భరోసా ప్రమాణాల అమలులో భాగంగా తెలంగాణ రాష్ట్రం పీహెచ్సీ కేటగిరిలో విజేతగా, యూపీహెచ్సీ కేటగిరిలో రన్నరప్ గా నిలిచింది. ఆసిఫాబాద్‌ జిల్లాలోని రొంపల్లి, ఖమ్మంలోని బోనకల్, యాదాద్రి-భువనగిరి జిల్లాలోని వేములకొండ పీహెచ్ సీలకు అవార్డులను అందజేశారు. అదేవిధంగా ఇన్ పెషెంట్ వార్డు, నవజాత శిశు సంరక్షణ, ఫార్మసీ, లాబోరేటరీ, ఇన్ పెషెంట్ వార్డు ల్లో వసతులపై కేంద్రం అవార్డులను ప్రకటించింది.

Next Story