- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ఏపీ బ్యూరో: కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని తీసుకుంటున్నా ఎవరి ప్రాణాలు వారే కాపాడుకోవాలని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలోని ఇంజనీరింగ్ వుమన్స్ హాస్టల్ లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ ను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ఎన్ని ఆటంకాలు సృష్టించినా విశాఖ రాజధాని కాకుండా ఆగదన్నారు. పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషించనుందని చెప్పారు. ప్రభుత్వం కరోనా నివారణకు అన్ని చర్యలూ తీసుకుంటోందని, ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
Next Story