కూలీల ఆటో బోల్తా.. 15 మందికి గాయాలు

by  |
accident
X

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుంతకల్లు దగ్గర హైవేపై కూలీల ఆటో అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా.. 15 మంది కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలు వజ్రకరూరు మండలం కొనకొండ్లకు చెందిన రమణమ్మగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



Next Story