- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కుత్బుల్లాపూర్ : ఆటోడ్రైవర్గా జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి డ్యూటీలో ఉండగానే అనుకోకుండా మృతి చెందాడు. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా చౌటుప్పల్కు చెందిన విజయ్ కుమార్ మిశ్రా (35) ఆటో ట్రాలీ నడుపుతూ ఉపాధి పొందుతున్నాడు.
ఈరోజు సాయంత్రం విధి నిర్వహణలో భాగంగా సుచిత్ర నుంచి కుత్బుల్లాపూర్ వైపు వెళ్తూ జీన్స్ కంపెనీ దగ్గరకు చేరుకోగానే ట్రాలీని వేగంగా తీసుకెళ్లి పక్కన ఆపాడు. గమనించిన స్థానికులు వెంటనే అతని వద్దకు వెళ్లి చూడగా సీట్లోనే అచేతనంగా వెనుకకు ఒరిగి ఉన్నాడు. వారు 108 సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలికి చేరుకుని అతన్ని పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. పాకెట్లో ఉన్న ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా తెలిసిన వారికి సమాచారం అందించారు. అతను గతంలో గాజుల రామారంలో ఉన్నట్లు ఆధార్ కార్డులో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.