- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదుపుతప్పి ఆటోబోల్తా.. ఒకరు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్డెస్క్ : ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అదుపుతప్పి ఆటోబోల్తా పడటంతో ఒకరు మృతిచెందారు. ఈ ఘటన జిల్లాలోని కూసుమంచి గ్రామ శివారు గంగాదేవి చెరువు వద్ద సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు కోదాడ వద్ద గల ఆరెగూడెం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ కృష్ణగా గుర్తించారు. ఇదిలాఉండగా, గత రాత్రి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి రోడ్డు కనిపించకపోవడం వలన ప్రమాదవశాత్తు ఆటో బోల్తా కొట్టి ఉంటుందని స్థానికులు అనుకుంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు […]</p>

X
దిశ, వెబ్డెస్క్ : ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అదుపుతప్పి ఆటోబోల్తా పడటంతో ఒకరు మృతిచెందారు. ఈ ఘటన జిల్లాలోని కూసుమంచి గ్రామ శివారు గంగాదేవి చెరువు వద్ద సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు కోదాడ వద్ద గల ఆరెగూడెం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ కృష్ణగా గుర్తించారు.
ఇదిలాఉండగా, గత రాత్రి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి రోడ్డు కనిపించకపోవడం వలన ప్రమాదవశాత్తు ఆటో బోల్తా కొట్టి ఉంటుందని స్థానికులు అనుకుంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






