గంజాయి తాగొద్దన్న ఆటో డ్రైవర్ పై దాడి…

by  |
గంజాయి తాగొద్దన్న ఆటో డ్రైవర్ పై దాడి…
X

దిశ, కంటోన్మెంట్ : బహిరంగ ప్రదేశంలో గంజాయి తాగుతున్న నలుగురు పోకిరీలను నిలదీసినందుకు ఓ ఆటో డ్రైవర్ ను చితక బాదిన ఘటన బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్ స్పెక్టర్ రవికుమార్ కథనం ప్రకారం.. న్యూ బోయిన్‌పల్లి కంసారిబజార్ కు చెందిన సుధాకర్ రెడ్డి (51) వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. శనివారం సాయంత్రం స్థానికంగా ఉన్న నేతాజీ స్కూల్ వద్ద నలుగురు యువకులు బహిరంగంగా గంజాయి తాగుతుండడాన్ని గమనించిన సుధాకర్, యువకులను ఇక్కడ గంజాయి తాగుతున్నారేంటీ..? అని నిలదీసాడు.

దీంతో కోపోద్రిక్తులైన సదరు యువకులు సుధాకర్ పై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సుధాకర్ కి ఓ పన్ను విరిగిపోగా, ముక్కుకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితుల్లో ఇద్దరు యువకులు రాకేశ్, శివ లుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మిగితా ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story

Most Viewed