‘బాక్సింగ్ డే’ ఆసిస్‌దే

by  |
‘బాక్సింగ్ డే’ ఆసిస్‌దే
X

సిడ్నీ: ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న బాక్సింగ్ డే టెస్టులోనూ ఆస్ట్రేలియానే పైచేయి సాధిస్తుందని ఆ జట్టు మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ జోస్యం చెప్పాడు. టీమ్ ఇండియాలో కేఎల్ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, అజింక్య రహానె, పుజారా వంటి క్లాస్ ప్లేయర్లు ఉన్నా గెలిచేది మాత్రం ఆస్ట్రేలియానేనని దీమా వ్యక్తం చేశాడు. తొలి టెస్టులో ఘోర ఓటమి నుంచి భారత జట్టు ఇంకా కోలుకోలేదని, ఆసిస్ మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుందని చెప్పాడు. పైగా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ వంటి కీలక ఆటగాళ్లు జట్టులో లేకపోవడం టీమ్ ఇండియాకు అతిపెద్ద లోటని అభిప్రాయపడ్డాడు. అలాగే, తొలి టెస్టులో విఫలమైన భారత ఆటగాళ్లను నిందించడం కన్నా తమ బౌలర్లు పాట్ కమ్మిన్స్, హజెల్‌వుడ్‌ల అద్భుత ప్రదర్శనను ప్రశంసించడం ఉత్తమమన్నాడు.



Next Story

Most Viewed