ఆత్మహత్యాయత్నం: పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న వ్యక్తి

by  |
suicide Attempt
X

దిశ, చేవెళ్ల: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మల్కాపూర్-కందాడ మధ్యలో మంగళవారం చోటుచేసుకుంది. ఒళ్లంతా కాలిపోయి గాయాలతో రోడ్డు పక్కన ఆ వ్యక్తిని పలువురు గమనించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, బాధితుడు షాబాద్ మండలం రేగడిదోస్‌వాడ గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డిగా గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed