అలుసిస్తే అప్పు తీసుకొని హత్యాయత్నం

by  |
అలుసిస్తే అప్పు తీసుకొని హత్యాయత్నం
X

దిశ, నారాయణఖేడ్: వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి ని తీసుకున్న అప్పు చెల్లించమంటే హత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. నారాయణఖేడ్‎కు చెందిన జన్మల వీరేశం, అనితలు పట్టణంలోని ఏఎస్‎రావు నగర్‎లో నివాసం ఉంటున్నారు. వీరేశం ప్రైవేట్ డ్రైవర్‎గా పనిచేస్తుండగా అనిత భవనాల నిర్మాణం పనుల్లో కూలిగా పనిచేస్తోంది. అక్కడ అనితకు ఎన్.జి. హుక్రానాకు చెందిన కమ్మరి బ్రహ్మచారితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధంగా మారింది. ఈ క్రమంలో బ్రహ్మాచారి అనిత వద్ద రూ.30 వేలు అప్పుగా తీసుకున్నాడు. అనిత డబ్బులు అడిగిన ప్రతిసారి ఆతను రేపు మాపు అంటూ సమయం దాటి వేస్తున్నాడు. మంగళవారం అనిత మరోసారి డబ్బు అడగడంతో బ్రహ్మచారి ఆమెపై కత్తితో దాడికి దిగాడు. ఆమెను గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడు బ్రహ్మచారిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు నారాయణఖేడ్ ఎస్ఐ సందీప్ వెల్లడించారు.



Next Story

Most Viewed