అమానుషం.. బతికుండగానే శిశువు ఖననానికి యత్నం

by  |
buried alive
X

దిశ, ఏపీ బ్యూరో: విశాఖలో దారుణం చోటు చేసుకుంది. శిశువు బతికి ఉండగానే పూడ్చిపెట్టేందుకు కొందరు దుండగులు ప్రయత్నించారు. అయితే చిన్నారి ఏడ్వడంతో శ్మశాన వాటిక సిబ్బంది ప్రశ్నించడంతో ఆ దుండగులు అక్కడ నుంచి నెమ్మదిగా జారుకున్నారు. ఈ అమానుష ఘటన జిల్లాలోని జ్ఞానాపురం శ్మశాన వాటికలో చోటు చేసుకుంది.

ముక్కుపచ్చలారని శిశువును బతికి ఉండగానే పూడ్చేయాలని కోరుతూ విశాఖపట్నంలోని జ్ఞానాపురం శ్మశాన వాటికకు కారులో నలుగురు వ్యక్తులు వచ్చారు. కవర్లో ఉంచిన శిశువును పాతిపెట్టాలని కోరారు. పాతిపెట్టేందుకు కవర్ తెరిచి చూడగా శిశువు ఏడవడటం ప్రారంభించింది. బతికి ఉండగానే ఎందుకు ఖననం చేస్తున్నారని ప్రశ్నించగా.. ఆ నలుగురు వ్యక్తులు అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారు. దీంతో శ్మశాన వాటిక సిబ్బంది శిశువును సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువును ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అనంతరం శ్మశాన వాటిక సిబ్బంది కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


Next Story