- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, దుబ్బాక : భూ తగాదాల్లో భాగంగా పంచాయతీ పెట్టిన పెద్దమనుషుల సాక్షిగా కల్లు సీసాతో దాడి చేసిన ఘటన మిరుదొడ్డిలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన నేరెళ్ల పరుశురామ్ గౌడ్ తనకు వారసత్వంగా రావాల్సిన భూమి విషయంలో గొడవలు కావడంతో స్థానిక కల్లు డిపోలో కుల పెద్ద మనుషుల ఆధ్వర్యంలో పంచాయతీ నిర్వహించారు. పంచాయతీలో సహనం కోల్పోయిన కిష్టగౌడ్, అతని కొడుకు సందీప్ పరుశురామ్ గౌడ్ పై ఒక్కసారిగా కల్లు సీసాతో దాడి చేశారు. తలకు తీవ్ర గాయం కావడంతో వెంటనే దుబ్బాక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో దుబ్బాక వైద్యులు సిద్దిపేట ఆసుపత్రికి రిఫర్ చేశారు. తనకు రావాల్సిన వారసత్వం భూమిని అడిగినందుకే ఇలా దాడి చేసి చంపాలని చూశారని తమకు న్యాయం చేయాలని బాధితుడు మీడియా ముందు మొర పెట్టుకున్నాడు.
Next Story