అమానుషం: ఆటోడ్రైవర్​ కుటుంబంపై ఇనుప రాడ్లతో దాడి.. ఎందుకో తెలుసా..?

by  |
అమానుషం: ఆటోడ్రైవర్​ కుటుంబంపై ఇనుప రాడ్లతో దాడి.. ఎందుకో తెలుసా..?
X

దిశ, చార్మినార్ : స్వల్ప విషయమై ఇద్దరు బాలుర మధ్య తలెత్తిన వివాదం కాస్త చిలికి చిలికి గాలివానలా మారింది. తన కుమారుడిని ఎందుకు బెదిరిస్తున్నావ్​అని అడిగిన పాపానికి ఆటోడ్రైవర్​కుటుంబంపై ఇనుపరాడ్లు, ఇటుకలతో దాడికి పాల్పడిన ఘటన పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే .. పాతబస్తీ చాంద్రాయణగుట్ట జహంగీరాబాద్​కు చెందిన జహంగీర్​వృత్తి రీత్యా ఆటోడ్రైవర్. జహంగీర్​కుమారుడు ఇంటి పక్కన కూర్చొని ఉండగా స్థానికంగా ఉండే మరో కుర్రాడు వచ్చి ఇక్కడ ఎందుకు కూర్చున్నావ్​ అని బెదిరించడంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది.

అప్పటి వరకు బాలుర మధ్య జరిగిన వివాదం కాస్త ఇరు కుటుంబాల పెద్దల చుట్టూ తిరిగింది. నా కొడుకును ఎందుకు బెదిరిస్తున్నావ్​అని అడిగిన పాపానికి ముఖరం, ముజాయిద్, జుబేర్, ముజాఫర్, సోహైల్​అనే వ్యక్తులు ఇనుపరాడ్లు, ఇటుకలతో ఆటోడ్రైవర్​కుటుంబంపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో జహంగీర్​కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story