జీతం అడిగినందుకు వలస కూలీలపై దాడి

by  |
జీతం అడిగినందుకు వలస కూలీలపై దాడి
X

దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ సమీపంలోని ఓ ప్లైవుడ్ కంపెనీ యాజమాన్యం దారుణానికి పాల్పడ్డారు. కంపెనీలో పనిచేసే కార్మికులను విచక్షణ రహితంగా చితకబాదారు. లాక్‎డౌన్ నేపథ్యంలో తమ స్వస్థలాలకు వెళ్తామని.. తమకు రావాల్సిన కూలీ డబ్బులు ఇవ్వమని అడిగినందుకు కంపెనీ సూపర్‌వైజర్ కొట్టాడని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని చేసినందుకు డబ్బులు అడిగితే.. ఇలా కొట్టడం సరైంది కాదని బాధితులు వాపోయారు.

tag: Attack, migrant workers, supervisor, salary, Plywood Company, rangareddy

Next Story

Most Viewed