ఎంసీపీఐ(యు) పార్టీ కార్యాలయంపై దాడి

by  |
ఎంసీపీఐ(యు) పార్టీ కార్యాలయంపై దాడి
X

దిశ‌, వ‌రంగ‌ల్ తూర్పు: వరంగల్ అర్బన్ జిల్లా ఎంసీపీఐ(యూ) పార్టీ కార్యాలయంపై గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు దాడి చేశారు. శుక్ర‌వారం సాయంత్రం సుమారు 6నుంచి 7గంట‌ల మ‌ద్య ఈ ఘ‌ట‌న జరిగిన‌ట్లుగా ఎంసీపీఐ (యూ) వరంగల్ అర్బన్ రూరల్ జిల్లా కార్యదర్శులు పనస ప్రసాద్, గోనె కుమారస్వామి తెలిపారు. సుమారు ఏడు గంట‌ల ప్రాంతంలో కార్యాల‌యానికి వచ్చేసరికి ఆఫీసుకు సంబంధించిన ప్లెక్సీలు చింపివేశార‌ని వారు ఆరోపించారు. త‌లుపులకు వేసిన‌ తాళం పగులగొట్టి, బీరువాను ధ్వంసం చేశార‌ని తెలిపారు. అంత‌టితో ఆగ‌కుండా బీరువాలో రెండు కత్తులు అమర్చార‌ని ఆరోపించారు. ఈ ఘటనకు పాల్ప‌డిన ఆ దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు .



Next Story

Most Viewed